telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సనత్‌నగర్‌లో వ్యక్తి సజీవ దహనం!

Sanatnagar burn death on road Hyderabad

హైదరాబాద్ సనత్‌నగర్‌లో దారుణం జరిగింది. శుక్రవారం ఉదయం  ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్నేహపురి కాలనీలో వెంకటేష్ గుప్తా అనే వ్యాపారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తట్టుకోలేక గట్టిగా కేకలు వేశాడు. అయినా అక్కడ ఉన్న వాళ్లు స్పందించలేదు.  మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేయలేదు.చివరికి అతని భార్య మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. సజీవ దహనమవుతున్న దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. వెంకటేష్ కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. కుటుంబసమస్యలు, ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts