శాంసంగ్ గెలాక్సీ ఏ51ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ ఏ50కి కొనసాగింపుగా మిలినియల్స్ కోసం సరికొత్త ఫీచర్స్తో ఈ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జనవరి 31 నుంచి అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయని శాంసంగ్ తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద అమెజాన్ పే తో ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు 5 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తున్నారు. దానితోపాటు ఒకసారి ఉచిత స్ర్కీన్ రీప్లేస్మెంట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది.
గెలాక్సీ ఏ51 ఫీచర్లు : ఈ మొబైల్ను 8జీబీ ర్యామ్, 128జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ 10 ఒన్ యుఐ 2.0 ఓఎస్ను ఉపయోగించారు. ఈ ఫోన్ 2.3జీహెచ్జెడ్ ఆక్టాకోర్ ఎక్స్నాస్ 9611 ప్రాసెసర్పై పనిచేస్తుంది. దీనికి 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (1080×2400 పిక్సెల్) సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేను అమర్చారు. ఇక కెమెరా విషయానికొస్తే… ఇందులో మొత్తం 5 కెమెరాలు ఉన్నాయి. వెనకవైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో నాలుగు కెమెరాలను అందిస్తున్నారు. సెల్పీ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంచారు. 4,000ఎంఏహెచ్ సామర్థ్యంతో 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని అమర్చారు. గెలాక్సీ ఏ51 ధరను రూ.23,999గా సంస్థ నిర్ణయించింది. ప్రిసమ్ క్రష్ బ్లాక్, వైట్, బ్లూ, పింక్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.
సినీ పరిశ్రమలోని పెద్దల పిల్లలు కూడా డ్రగ్స్ వాడతారు… దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు