బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తొలి సినిమా ‘హృదయకాలేయం’తోనే సెటైరికల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సంపూ చిన్న హీరో అయినప్పటికీ తాను సంపాదించేది కొద్దిపాటిలో ఆయన దానధర్మాలు కూడా చేస్తుంటారు. పకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారి సంపూర్ణేష్ బాబు తన వంతుగా విరాళాలు ఇస్తూనే వచ్చారు. తాజాగా సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ చారిటీకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లన్నీ ఆగిపోవడంతో సంపూ తన సొంతూరు సిద్ధిపేట వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్లో సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్లో భాగంగా తన కంసాలి వృత్తిని గుర్తుచేసుకున్నారు. తన భార్య కోసం కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జలు స్వయంగా తయారుచేశారు. ఈ మేరకు ఒక వీడియోను సంపూ ట్వీట్ చేశారు. రాజు పేద తేడా లేదు.. నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ మా ఆవిడ కోసం, నా పాత కంసాలి వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జలు చేయించి ఇచ్చాను అని ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన సింప్లిసిటీని చూసి మరోసారి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు ‘ది రియల్ మ్యాన్’ అంటున్నారు.
రాజు పేద తేడా లేదు…
నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు..
నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూమా ఆవిడ కోసం, నా పాత “కంశాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను#BetheREALMAN pic.twitter.com/TDrHZtnXIL
— Sampoornesh Babu (@sampoornesh) April 23, 2020
ఆ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసిన మంచు విష్ణు…