telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యథార్థ ఘటన ఆధారంగా ప్రారంభమైన ‘సమిధ’

ప్రముఖ కన్నడ నటుడు శశికుమార్ తెలుగులోనూ కొన్ని చిత్రాలలో నటించాడు. ఆయన కుమారుడు అక్షిత్ ‘సీతాయణం’ అనే మూవీతో త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ను రవితేజ విడుదల చేశారు. కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కొవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే… ఆ సినిమా రిలీజ్ కాకముందే… అక్షిత్ మరో త్రిభాషా చిత్రానికి శ్రీకారం చుట్టేశాడు. రాజస్థాన్ లో జరిగిన ఓ యదార్థ గాథతో ‘సమిథ’ అనే సినిమా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు సతీశ్ మాలెంపాటి. ఈ మూవీలో ‘ఉండిపోరాదే’ ఫేమ్ అనువర్ణ, తమిళ నటి చాందిని హీరోయిన్లుగా నటించబోతున్నారు. డిసెంబర్ 8 నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి, వచ్చే యేడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నారు. రెండు గంటల పాటు ఊహించిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో సాగే ఈ మర్డర్ మిస్టరీ థిల్లర్ మూవీ అరుణం ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మితమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో దీనికి స్వరాలు సమకూర్చుతున్నాడు.

Related posts