ఏమాయ సినిమాతో కుర్రాళ్లకు మాయ చేసిని సమంత..తెలుగు సినీ పరిశ్రమలో అభినయం , అందంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఈ క్యూటీ బేబికి సోషల్ మీడియాలో సమంతకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
ఇక అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్ మీడియా అకౌంట్లపై మరింత ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసే పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా తన మనసులోని బాధను బయటపెడుతూ ఇన్స్టాలో ఓ పోస్టును షేర్చేసుకున్నారు సామ్.
“ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించదు..అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతికత లేనట్లే” అంటూ ఓ కొటేషన్ను ఇన్స్టాలో సమంత పోస్ట్ చేసింది.
సమంత, నాగ చైతన్య జంట విడాకుల అంశం తెలిసినప్పటి నుంచి.. ఇరువురు సోషల్ మీడియాలో ఏవిధమైన పోస్టు పెట్టినప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. సంబంధంలేని విషయాలను కూడా అభిమానులు వీరి జీవితానికి ఆపాదిస్తున్నారని ఇటీవలే సమంత ఇన్స్టాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టుపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. తెలుపు రంగు డ్రస్ ధరించి నడుస్తూ ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు.
ఇదిలా ఉంటే.. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న అనంతరం అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది సమంతదే తప్పు అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ను కూడా దారుణంగా ట్రోల్ చేస్తూ అతడిని నిందిస్తున్నారు.
కాగా.. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సామ్ ‘శాకుంతలం’, ‘కాతు వక్కుల రెందు కాదల్’ చిత్రాల్లో నటిస్తున్నారు.
#Samantha latest insta story..#SamanthaRuthPrabhu #Samanthadivorce #Viral #Trending pic.twitter.com/DHnaElvl1q
— telugufunworld (@telugufunworld) October 8, 2021