ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న అక్కినేని కోడలు పిల్ల సమంత .. గత కొన్ని రోజులుగా సమంత నాగచైతన్య తో విడాకుల తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియా అకౌంట్స్ లో అక్కినేని ఇంటిపేరుని తొలగించడం, భర్త లేకుండా ఒంటరిగా సమంత హాలిడే ట్రిప్స్ వెళ్తూ వస్తుండడం, మొన్న తిరుమలలో ఒంటరిగా శ్రీవారిని దర్శించుకున్న సమంత.. విడాకులపై స్పదించమన్న విలేఖరిని ‘నీకు బుద్ధి ఉందా’ అని గట్టిగా మాట్లాడ టం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.
అంతేకాకుండా.. నిన్న అట్టహాసంగా జరిగిన చైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కి అమీర్ ఖాన్, చిరంజీవి వంటివారు హాజరైతే సమంత రాకపోవటం కూడా మీడియాలో విడాకులపై మరిన్ని అనుమానులు వస్తున్న సందర్భంలో సమంత తాజాగా ఇన్స్ట్రాగ్రామ్లో వేదిగ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఆ పోస్ట్లో నువ్వు నన్ను బాధపెట్టి వుండొచ్చు..నేను నిన్ను బాధ పెట్టి వుండొచ్చు. ఒకరిని ఒకరం బాధ పెట్టుకుని వుండొచ్చు. మొత్తానికి రియాల్టీ ఇదే.. అంటూ సామ్ కొటేషన్స్ పోస్ట్ చేసింది. ఇక కాలమే దీనికి సమాధానం చెప్తుంది అన్న రీతిలో మరో పోస్ట్ పెట్టింది. వసంత కాలాన్ని పొందాలంటే శిశిరాన్ని కూడా భరించాలి అంటూ తన ప్రస్తుత పరిస్థితిని చెబుతోన్నట్టు మరో పోస్ట్ పెట్టింది సామ్.
సమంత వేర్వేరు కోట్స్తో చేసిన పోస్ట్లు నాగ చైతన్యను ఉద్దేశించి చేసినవేనా? అనే అనుమానం కలుగుతోంది. అయితే జనాలకి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఈ ఇన్ డైరెక్ట్ విమర్శలతో సమంతకే కాదు.. అక్కినేని ఫ్యామిలీకి అగౌరవమే అంటున్నారు అభిమానులు. నిజంగా వీరిద్దరి మధ్య గొడవలు లేకపోతే ఎందుకు ఎవరూ ఈ మ్యాటర్ గురించి మట్లాడటం లేదని మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.
ఇండస్ట్రీలో “ఒకే ఒక్క ఛాన్స్…” అంటూ సంగీత షాకింగ్ కామెంట్స్