సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘యశోద’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది.
శ్రీదేవి మూవీస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘యశోద’. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు.
ఈనెల 12వరకు ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ మొదలు పెడతామని, మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘యశోద’ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో తమిళనటి వరలక్ష్మి, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం పనులు జరిగితే మార్చి 31న సినిమా మొత్తం పూర్తవుతుంది.