హీరోయిన్ సమంత.. అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో హైదరాబాద్కు చేరుకున్న కొన్ని గంటల్లోనే ఆమె అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్తో ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
సోమవారం హైదరాబాద్లోని ఏఐజీ అసుపత్రికి వెళ్లి సమంత పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి అవసరమైన చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
అయితే సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. స్వల్ప అస్వస్థత కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుందని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దని సమంత మేనేజర్ మహేంద్ర తెలిపారు.