టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా గుర్తింపు పొందారు అక్కినేని నాగచైతన్య, సమంత. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో సమంత విడిపోతుంది అని కొన్ని నెలలుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అనుమానాలకి ఊతమిచ్చేలా సమంత కూడా ఏమోషినల్ పోస్టులు పెడుతుండటం.. అక్కినేని కుటుంబం నుండి ఎవరు ఈ అంశంపై స్పందించక పోవటంతో నిజంగానే సామ్-చై బంధం చెడిందని ప్రచారం జరుగుతుంది.
చైతు, సమంత మధ్య విభేదాలు నిజమే అంటూ అందరికి బాధ కలిగించే వార్త బయటకొచ్చింది. వీరిద్దరూ డివోర్స్ కి ప్రయత్నిస్తుండగా.. ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కౌన్సిలింగ్ కోసం ఇటీవల సమంత గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చి వెళ్లిందట.
ఇటీవల సోషల్ మీడియాలో ఇంటి పేరుని తీసేసిన సమంత వరుస షూటింగ్స్ లో బిజీ ఉన్నా.. చైతు కోసం కచ్చితంగా టైం స్పెండ్ చేసేది. భర్త నాగచైతన్యని వదిలి ఇప్పటివరకు ఎలాంటి వెకేషన్స్ కి వెళ్లని సమంత.. చైతు లేకుండానే తాజాగా సమంత ఒంటరిగా గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.
వరుసగా సినిమాలు చేస్తూ.. కుటుంబానికి సమయం ఇవ్వకపోవటమే విడాకులకు ముఖ్య కారణమని అంటున్నారు. సమంత ఫ్యామిలీ లైఫ్ కి పరిమితం కావాలని అక్కినేని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కానీ అందుకు సమంత అంగీకరించడం లేదట. ఇక్కడే విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఎంతో ప్రయత్నించారట. కానీ ఆ పయత్నాలు వర్కౌట్ కాలేదట.
‘నీ నవ్వు నీ చుట్టూ ఉన్న వారికి ఎంత అవసరమో నీకు తెలియదు. నువ్వు చూపించే దయ, మరో వ్యక్తి జీవితం మొత్తాన్ని ఎంతలా మార్చేస్తుందో నీకు తెలీదు. నీ చిరునవ్వు, నువ్విచ్చే ఒక చిన్న కౌగిలింత లేదా లోతైన సంభాషణ ఎదుటి వ్యక్తికి ఎంత అవసరమో నీకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ప్రేమ కురిపిద్దామా అని ఎదురుచూడకు .ఎవరో ఒకరు నీపై ప్రేమ కురిపిస్తారని ఎదురుచూడకు. మంచి పరిస్థితుల కోసమో లేదా ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారనో ఎదురుచూడకు. అందరిపట్ల దయతో ఉండు. ఎందుకంటే, ఎంతమందికి నీ దయ, ప్రేమ అవసరమో తెలియదు కదా..’ అంటూ సమంత వరుస పోస్టులు పెడుతుంది. ఇప్పటికే ఇలాంటివి పది పోస్ట్లు చే సింది. ఈ పోస్ట్ ను మాత్రం ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు అర్థం చేసుకుంటున్నారు.
2017లో చై సామ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్లపాటు ఈ జంట అన్యోన్యంగా జీవించారు. కానీ ఊహించని విధంగా ఇలా విభేదాలు తలెత్తడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. కనీసం ఫ్యామిలీ కోర్టులో అయినా సమంత, చైతూలకి రాజి కుదరాలని అక్కినేని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.