బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం “భారత్”. సల్మాన్ఖాన్, కత్రినాకైఫ్, దిశా పటానీ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం “భారత్” అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. సల్మాన్ ఖాన్.. యువకుడిగా సర్కస్లో బైకుపై విన్యాసాలు చేసే సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సల్మాన్ నేవీ అధికారిగా..60 సంవత్సరాల వృద్ధుడిగా విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న భారత్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, జాకీష్రాప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఘనవిజయం సాధించిన “ఓడ్ టు మై ఫాదర్” చిత్రానికి రీమేక్గా భారత్ తెరకెక్కుతోంది. ఈద్ కానుకగా ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.
previous post
next post