ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసుకున్న అతి తక్కువ నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఆమె మలయాళీ భామ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకి ఈజీగా కనెక్ట్ అయింది. ఇటీవల పడి పడి లేచే మనసు అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సూర్య సరసన కథానాయికగా నటిస్తుంది. అయితే రీసెంట్గా ఈ అమ్మడిని ఓ ఇంటర్వ్యూలో మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా? ప్రేమ వివాహమా? అని ప్రశ్నించగా పెళ్ళీ గిళ్ళీ జాన్తా నై.
తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవితాంతం పెళ్ళే చేసుకోనని ఖరాఖండీగా చెప్పేసింది సాయిపల్లవి. ఈ అమ్మడి సమాధానానికి నెటిజన్స్ బిత్తరపోతున్నారు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం కన్యగానే ఉండిపోతావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు దేవుడు ఆమె మనసు మార్చి పెళ్లి చేసుకునేలా చేయాలని కోరుకుంటున్నారు. ఇదేమి వెర్రో మరి, అయితే అయ్యిందా.. అంటారు; కాకపోతే కాలేదా ..అంటారు… ఏమోలే ఎవరి వెర్రి వారికి ఆనందం. మొత్తానికి పెళ్లి వద్దన్నదా.. అప్లికేషన్ పెట్టుకోమన్నదా..!!