telugu navyamedia
తెలంగాణ వార్తలు

పాపం పండింది

సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావ‌త్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును ప‌ట్టుకోవడానికి వారం రోజుల నుంచి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నాకాబందీ నిర్వ‌హిస్తున్నారు. రాజు ఆచూకీ చెప్పిన వారికి రూ.10 ల‌క్ష‌లు బ‌హుమానం ఇస్తామ‌ని చెప్పారు. పోలీసుల‌పై కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రాజు చివ‌ర‌కు స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్వే ట్రాక్ మీద శ‌వ‌మై క‌నిపించారు.

హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి గురువారం (సెప్టెంబర్‌ 9) చాక్లెట్‌ ఆశ చూపి తీసుకెళ్లి నిందితుడు రాజు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారి తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన గిరిజన కుటుంబం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తోంది. ఈ సమయంలోనే ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సంఘాలు, సామాజికవేత్తలు నిరసనలు తెలిపారు.

 

 

Related posts