telugu navyamedia
సినిమా వార్తలు

త్వరలోనే మీ ముందుకు వస్తా: సాయి ధరమ్‌ తేజ్‌

రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మెగామేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కోలుకుంటున్నారు. తాజాగా సాయి హాస్పిటల్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ చేశారు. నాపై, రిపబ్లిక్‌ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్‌ అన్నది చిన్నపదమే. త్వరలోనే మీ ముందుకు వస్తా అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ చేశాడు. ‘థంబ్స్ అప్‌’ సింబల్‌ చూపిస్తూ ఓ ఫోటోను ఆయన షేర్‌ చేశారు. దీంతో రూమర్లకు చెక్‌ పెట్టినట్లయ్యింది.

గతనెల 10వ తేదీన సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో హెల్త్‌ బులెటిన్‌ విడుదల కాలేదు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయితేజ్‌ ట్వీట్‌ మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో సాయితేజ్ పూర్తిగా కోలుకున్నట్లుగానే అర్థమైపోతుంది. మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతున్నట్లుగా సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈరోజు ఉదయం మీడియా ఇంటరాక్షన్ లో తెలియచేశాడు.కాగా సాయి తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్‌ సినిమా అక్టోబర్ 1న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది.

Related posts