“సాహో”లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ లుక్ ను ఇప్పటికే విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఎక్కడా ఇద్దరూ జంటగా కనిపించలేదు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను చిత్రబృందం విడుదల చేయలేదు. కానీ ఇంటర్నెట్లో ప్రత్యక్షమైన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంగ్ చిత్రీకరణ సమయంలో తీసిన ఫొటోను ఎవరో లీక్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్నభారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో”. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చిత్రానికి సంబంధించి వీడియోలు విడుదలై భారీ ప్రేక్షకాదరణను పొందాయి. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేశ్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, చుంకీ పాండే వంటి స్టార్స్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.