telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులుగా సాదుల మధుసూదన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్. రమేష్ రావు కోశాధికారిగా పి రాఘవేందర్ రెడ్డిలు భారీ మెజార్టీతో ఎన్నిక

ట్రస్మా రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా అంబర్ పేట ప్రగతివిద్యానికేతన్  హైస్కూల్ చైర్మన్ సాధుల మధుసూదన్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు.

సాదుల మధుసూదన్ కు 2220 ఓట్లు పోల్ కాగా ఆయన సమీప అభ్యర్థి ప్రకాష్ బాబుకు 91 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2129ఓట్ల భారీ మెజార్టీతో ఆయన ఎన్నికైనట్లు తెలంగాణ ట్రస్మా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు ఎన్నికల కమిషన్ చైర్మన్ నర్రా నారాయణరెడ్డి తెలిపారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి నర్రా నారాయణరెడ్డి సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలు ప్రకటించారు.

ప్రధాన కార్యదర్శిగా ఎన్. రమేష్ రావు కు 2217 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి కే. వీరన్నకు 94 ఓట్లు పోలయ్యాయి.

2123 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అదేవిధంగా కోశాధికారిగా పీ. రాఘవేంద్ర రెడ్డి 2193 ఓట్లు నమోదు కాగా సమీప ప్రత్యర్థి ఆర్. విష్ణువర్ధన్ రావుకు 118 ఓట్లు పోలయ్యాయి.

పి రాఘవేంద్ర రెడ్డి 2075 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలోని 11,000 పాఠశాలల్లో 35,00, 000 మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా సాదుల మధుసూదన్ ఎన్నిక కావడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నది.

పోలైన ఓట్లలో 92 శాతం ఓట్లు సాధించి సరికొత్త చరిత్రకు సాదుల మధుసూదన్ శ్రీకారం పలికినట్లు అయిందని ప్రైవేట్ పాఠశాల వ్యవహర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

డిజిటల్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు:

దేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల అధికారి నారాయణరెడ్డి తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి అత్యద్భుతంగా ప్రతి ఓటరు ఉత్సాహంగా ప్రతి జిల్లాలో ఆన్లైన్ లో ఓటింగ్ కు అవకాశం లభించిందని ఆయన వెల్లడించారు.

అందరి సభ్యుల అభిప్రాయ సేకరణ తీసుకొని ఈ ఆన్లైన్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కరెస్పాండెంట్ల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు ఎంతో సాహసోపేతమైన… చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా డిజిటల్ బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం విశేషం.

ఆన్లైన్ పద్ధతిలో ఎన్నికలు తొలిసారి నిర్వహించినప్పటికీ 53.1 ఓటింగ్ జరిగిందని ఆయన వివరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఓటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

సంగారెడ్డి, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, జిల్లాలో 95 నుంచి 98% ఓటింగ్ జరిగిందని చెప్పారు. అదేవిధంగా జోగులాంబ, సిరిసిల్ల, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలో 20 శాతం పైగా ఓటింగ్ జరిగింద ని చెప్పారు. ట్రస్మాలో మొత్తం 4353 ఓట్లు ఉండగా 2311 ఓట్లు పోలయ్యాయన్నారు.

ఎన్నిక ధ్రువీకరణ పత్రాల అందజేత:

ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షునిగా భారీ మెజార్టీతో ఎన్నికైన సాదుల మధుసూదన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎం రమేష్ రావు కోశాధికారిగా ఎన్నికైన పి రాఘవేంద్ర రెడ్డిలకు వారు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ట్రస్మా ఎన్నికల కమిషనర్ నర్రా నారాయణరెడ్డి తోపాటు ఎన్నికల కమిటీ సభ్యులు ఎస్. శ్రీనివాస్ రెడ్డి, రామ కవచం నాగరాజు, కే ఇన్నారెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, బండి లక్ష్మణ్, ఈ ప్రభాకర్ రెడ్డి, బత్తుల లక్ష్మణ్, ఆదినాధ్, పి. సుందర్, ఎస్. కొమురయ్యలు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ట్రస్మా కు మంచి రోజులు: ఎన్నికల కమిషనర్ నర్రా నారాయణరెడ్డి

ప్రతీ జిల్లా నుంచి రెస్పాండెంట్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొనడంతో పారదర్శకంగా జరిగిన ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని తెలంగాణ ట్రస్మా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు ఎన్నికల కమిషన్ చైర్మన్ నర్రా నారాయణరెడ్డి తెలిపారు.

సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేశంలోని మొట్టమొదటిసారిగా డిజిటల్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి సరికొత్త చరిత్రకు శ్రీకారం పలికామని చెప్పారు.

ఎన్నిక విధానం వినూత్నంగా నిలిచిందన్నారు. నూతన ఒరవడికి శ్రీకారం పలికిందని చెప్పారు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరు తమ ఇంటి నుంచే ఓటు వేసే అరుదైన అవకాశం కల్పించినట్లు చెప్పారు.

ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు వారి సమస్యల పరిష్కారం కోసం మంచి నాయకత్వం కోసం ఇన్నాళ్లు ఎదురు చూశారని చెప్పారు.

ప్రస్తుతం జరిగిన ఎన్నికల విధానంలో గెలుపొందిన నాయకులు ఆ దిశగా తమ కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు సాగుతారని ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు.

బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ సంక్షేమమే పరమావధిగా ముందుకు: రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్

బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ సంక్షేమమే పరమావధిగా తాను కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు సాగుతామని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోమవారం అయిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తనకు భారీ ఓట్లు వేసి గెలిపించడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఏ నమ్మకంతోనైతే ఓట్లేసారో అంతకంటే ఎక్కువ సంక్షేమం బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ కు జరిగే విధంగా తాను పనిచేస్తానని చెప్పారు. మారుమూల గ్రామం నుంచి హైదరాబాదు నడిబొడ్డున గల ప్రతి పాఠశాల కరస్పాండెంట్ తనపై ఓటేశారని చెప్పారు.

ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర నాయకులు వినయ్ కుమార్ గౌడ్, కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి, గొట్టిపర్తి భాస్కర్, గుల్షని, బోల్ల శ్రీకాంత్, ఈ. అచ్చయ్యా గౌడ్, ఉమామహేశ్వరరావు, మంచాల రఘు సహిద్, శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి లు నూతనంగా ఎన్నికైన నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు

Related posts