సచిన్ టెండూల్కర్-అంజలి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి వివాహ బంధానికి సోమవారంతో 26 వసంతాలు పూర్తయ్యాయి. 1995 మే 24న ఈ జంట ఒక్కటైంది. అయితే, సచిన్తో ఏర్పడిన మొదటి పరిచయం, ఏ అబద్ధం చెప్పి సచిన్.. తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడనే విషయాలను అంజలి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేశాయి. మేం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నాం. మా పరిచయం బలపడిన తర్వాత అతనితో మాట్లాడటానికి ఇప్పటి మాదిరిగా ఆ కాలంలో మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా లేదు. అందువల్ల అతనితో మాట్లాడటానికి 48 ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని దాటి టెలిఫోన్ బూత్కు వెళ్లేదాన్ని. ఎక్కువ సమయం మాట్లాడటంతో బిల్లు కూడా ఎక్కువగా వచ్చేది. టెలిఫోన్ బిల్లులను ఆదా చేయడానికి ప్రేమ లేఖలతో సంభాషించుకునేవాళ్లం. జర్నలిస్టుగా నటించాలని, అలా నన్ను వారి కుటుంబసభ్యులకు పరిచయం చేస్తానని చెప్పాడు. తనను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్న జర్నలిస్టుగా నన్ను సచిన్ను తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ సమయంలో సచిన్ కాస్త భయపడ్డాడు. సల్వార్ కమీజ్ ధరించి మొదటిసారి ఆయన ఇంటికి వెళ్లా’ అని అంజలి చెప్పుకొచ్చారు.
previous post
next post
అమరావతి గురించి ఇష్టం వచ్చినట్టు ప్రచారం: సుజనా చౌదరి