శబరిమల ఆలయం నేటి నుంచి తెరుచుకోనుంది. భక్తులను రేపటి నుంచి 21 వరకు దర్శనానికి అనుమతిస్తారు. తులా మాసం పూజల కోసం శబరిమల ఆలయం నేడు సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది . రేపట్నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అయ్యప్ప ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు. ఆరోజే ఆలయాన్ని మూసివేస్తారు.
రేపు (ఆదివారం) డ్రా పద్ధతిలో శబరిమల ఆలయ ప్రధాన పూజారిని ఎంపిక చేయనున్నారు. 21న శబరిమల ఆలయాన్ని ట్రావెన్ కోర్ బోర్డు మూసివేయనుంది. మళ్లీ నవంబర్ 2వ తేదీన ఆలయాన్ని తెరవనున్నారు. ఆ మరుసటి రోజే టెంపుల్ను మూసేసి, మండలం – మకరవిలాక్కు పండుగ నేపథ్యంలో నవంబర్ 15న ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు.
మరోవైపు ఆలయం తలుపులు తెరుచుకుంటున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఏలోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే భక్తులను వర్చువల్ బుకింగ్ ద్వారానే అనుమతిస్తారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన సర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలి.