కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఈవేళ నుంచి శమరిమల అయ్యప్ప ఆలయంలోకి రోజుకు 30 వేల మంది భక్తులను అనుమతించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు గర్భగుడిని పూజారులు తెరిచారు. మంగళవారం నుంచి భక్తులకు అయ్యప్పస్వామి దర్శనం అందుబాలోకి వస్తుంది.
డిసెంబర్ 26వ తేదీతో అయ్యప్ప మండల పూజ ముగియనున్నది. మండల పూజ అనంతరం మకరజ్యోతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల వస్తుంటారు. మకరజ్యోతి పూర్తైన తరువాత జరవరి 20 వ తేదీన ఆలయాన్ని మూసివేస్తామని అధికారులు తెలియజేశారు.
ఇక అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా టీకా సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. కరోనా కారణంగా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు.