సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. డార్లింగ్ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరో 68 రోజులలో విడుదల కానున్న ఈ చిత్ర షూటింగ్ గత వారం రోజులుగా హైదరాబాద్లోని రామోజీఫిలిం సిటీలో జరుపుకుంది. చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ నెల 9 నుండి అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ చిత్రీకరణ జరపనున్నట్టు సమాచారం. సాంగ్ కోసం భారీ సెట్స్ కోసం రూపొందించినట్టు తెలుస్తుంది. త్వరలోనే టీజర్, ట్రైలర్ లను విడుదల చేయనున్నారు. “సాహో” చిత్రాన్ని కేవలం ఇండియాలోనే కాకుండా చైనా, జపాన్, అమెరికా, బ్రిటన్, మలేషియా, సింగపూర్ తదితర లొకేషన్లలోనూ భారీగా విడుదల చేయాలని టీం ఆలోచిస్తుంది. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేశ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
previous post