యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో”. ఇప్పటికే విడుదలైన టీజర్లో ప్రభాస్ చేసిన స్టంట్స్, యాక్షన్ సీన్స్ సామాన్య జనాలనే కాక సెలబ్రిటీలని కూడా ఆకట్టుకుంటున్నాయి. 150 కోట్ల బడ్జెట్తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్ జరుగుతుండగా, ఆగస్ట్ 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు ప్రకటించారు. కానీ ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కావడం లేదట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30న విడుదల చేయనున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు యూవీ సంస్థ పేర్కొంది. ఇంతక ముందెన్నడు చూడని యాక్షన్ సీన్స్ చిత్రంలో ఉండనున్నట్టు వారు తెలిపారు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ను దాదాపు రూ.70 కోట్ల వ్యయంతో ఇటీవలే చిత్ర బృందం తెరకెక్కించిందట. ఎనిమిది నిమిషాల నిడివితో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ను అబుదాబిలో ఓ ఎడారి సెట్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దాదాపు 25 నెలల పాటు సాహో కోసం చిత్ర బృందం పని చేసింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.
previous post