హైదరాబాద్ లో మెట్రోరైలు ప్రయాణించాల్సిన ట్రాక్ పై కాకుండా వేరే ట్రాక్ పై వెళ్లిందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఖండించారు. ఈ వార్తలు అవాస్తవమని, వాస్తవాలు తెలియకుండా వదంతులు వ్యాప్తి చేయోద్దని హితవు పలికారు. అసెంబ్లీ స్టేషన్ వద్ద గాలి ధాటికి పిడుగులను ఆకర్షించే రాడ్ ట్రాక్పై పడిందని తెలిపారు. దీంతో, విద్యుత్ సరఫరాను నిలిపి వేశామని స్పష్టం చేశారు.
బ్యాటరీ సాయంతో మెట్రోరైలు అసెంబ్లీ స్టేషన్ వరకు వెళ్లి ఆగిందని అన్నారు. అస్తమాతో ఇబ్బంది పడుతున్న ఒక ప్రయాణికుడు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. తక్షణమే ప్రయాణికులను ఖాళీ చేసి అసెంబ్లీ స్టేషన్కు తీసుకెళ్లాం. తక్షణమే ట్రాక్ నుంచి రాడ్ను తొలగించాం. అరగంట పాటు ప్రయాణికులకు అంతరాయం కలిగిందని తెలిపారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నన్ను అరెస్ట్ చేసినా భయపడను.. బీజేపీ ముందు తల వంచను: మమతా