ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఘాటుగా స్పందించారు. ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ దురహంకారానికి ఇది పరాకాష్ట అని దుయ్యబట్టారు.
యూనియన్ల వల్లే ఆర్టీసీ ఇంకా బతికుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్టీసీ కేసీఆర్ అయ్య జాగీరు కాదని, కార్మికుల కష్టం అని వ్యాఖ్యానించారు. ఇలాంటి సీఎంలను చాలా మందిని చూశామని అన్నారు. సమ్మెపై వెనెక్కి తగ్గే ప్రసక్తే లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడొద్దని అశ్వత్థామరెడ్డి సూచించారు.
కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్లపై కేసులా ?: విజయశాంతి