దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్లో భాగంగా దేశ పర్యటన చేస్తున్న మూవీటీం తాజాగా కల్కత్తాలో సందడి చేసింది. అక్కడ చారిత్రాత్మక హౌరా బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలు తెలియజేశారు.
హౌరా బ్రిడ్జి వద్ద రాంచరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ స్టైల్ లో చేతులు కలపడం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. . ఈ ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేసింది మూవీ టీమ్ .ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్తో ‘ఆర్ఆర్ఆర్’ను తీర్చిదిద్దారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లు ఈ వీకెండ్ ‘ఆర్ఆర్ఆర్’ రీసౌండ్తో దద్దరిల్లనున్నాయి.