దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఈ సినిమా మరోసారి వాయిదా పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ సినిమా తిరిగి షూటింగ్ ప్రారంభించడం పట్ల దర్శకుడు రాజమౌళి స్పందించాడు. “కరోనా వలన ఆగిపోయిన సినిమా షూటింగ్ లు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే సినిమాకి సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్ చాలా వర్క్ మిగిలిపోయింది. వి.ఎఫ్.ఎక్స్ స్టూడియోస్ అన్ని మూసివేసి ఉండడంతో పనులు ముందుకు సాగలేదు. ఇక సినిమా షూటింగ్ ఎలా మొదలు పెట్టాలి అన్నదానిపైన కసరత్తులు మొదలవుతున్నాయి. అతి త్వరలోనే షూటింగ్ ని మొదలు పెట్టనున్నాం. ప్రస్తుతం రెండు నెలలు షూటింగ్ చేయాలనుకుంటున్నాం” అని జక్కన్న వెల్లడించారు. రాజమౌళి చెప్పినట్టుగా చూస్తే సినిమా నవంబర్ లో మొదలు పెడితే నవంబర్, డిసెంబర్ ఈ రెండు నెలలు షూటింగ్ లకే టైం కేటాయించాల్సి ఉంటుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సినిమా ప్రమోషన్స్ వీటికి మరింత సమయం పడుతుంది. ముందుగా అనుకున్న జనవరి 8కి సినిమా రావడం కష్టమే అనిపిస్తోంది.
previous post
next post