దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీన విడుదల చేసిన భీమ్ టీజర్ యూట్యూబ్లో రికార్డులు కొల్లగొడుతోంది. అతి తక్కువ టైమ్లోనే మిలియన్ లైకులు సాధించిన ఇండియన్ సినిమాగా ఘనత సాధించింది. అంతేకాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అందని ద్రాక్షగా నిలిచిన 1 మిలియన్ లైక్డ్ టీజర్ రికార్డును “ఆర్ఆర్ఆర్”తో సాధించాడు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పై వచ్చిన రామరాజు టీజర్ కూడా మన టాలీవుడ్ లో అనేక రికార్డులను నెలకొల్పి ఇప్పుడు ఒక ఆల్ టైం రికార్డును అందుకుంది. లేటెస్ట్ గా 33.3 మిలియన్ వ్యూస్ మార్కును అందుకొని మన టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ అందుకున్న టీజర్ గా నిలిచింది. దీనికి ముందు సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు” టీజర్ ఉంది. మరి చరణ్ రికార్డును భీం టీజర్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.
previous post