telugu navyamedia
క్రీడలు వార్తలు

టాస్ గెలిచిన కోహ్లీ.. మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై…

ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ తో చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే చాలా రోజుల తర్వాత టాస్ గెలవడం చాలా సంతోషంగా ఉంది అని కోహ్లీ తెలిపాడు. ఎందుకంటే కోహ్లీ ఎక్కువగా టాస్ ఓడిపోతాడు అనే విషయం అందరికి తెలిసిందే. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండ ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచులు జరగమున విషయం తెలిసిందే.

బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), రజత్ పాటిదార్, ఎబి డివిలియర్స్ (w), గ్లెన్ మాక్స్వెల్, డేనియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్

ముంబై : రోహిత్ శర్మ (c), క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (w), హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, మార్కో జాన్సెన్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

Related posts