telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : దారుణంగా విఫలమైన కేకేఆర్… ఆర్సీబీ లక్ష్యం..?

ఐపీఎల్ 2020 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఎప్పుడు విఫలమయే ఆర్సీబీ బౌలర్లు కేకేఆర్ ను దారుణంగా దెబ్బ తీశారు. పవర్ ప్లే లోనే కేవలం 14 పరుగులకు 4 వికెట్లు తీసిన బెంగళూరు బౌలర్లు ఎవరిని నిలదొక్కుకోనివ్వలేదు. జట్టు తరపున అత్యధిక పరుగులు చేసింది కెప్టెన్ మోర్గాన్. తాను కొట్టిన 30 పరుగులే ఆ జట్టు తరపున ఓ ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు. చివరి వరకు బెంగళూరు బౌలర్లు కేకేఆర్ కట్టడి చేస్తూనే ఉండటంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసుకోగా యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని ఒక్కో వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఆర్సీబీ 85 పరుగులు చేయాలి. అయితే ఆర్సీబీని ఓసారి కేకేఆర్ 50 పరుగుల లోపే ఆల్ ఔట్ చేసింది. ఆ విషయాన్ని ఎవరు మర్చిపోలేరు. ఈ రోజు కూడా కేకేఆర్ ఆ తరహా ప్రదాయశాన చేస్తే విజయం సాధించవచ్చు. కానీ అది కష్టం. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts