telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న కోల్‌కత …

ఐపీఎల్ 2020 లో ఈరోజు షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో కోల్‌కత మొదట బౌలింగ్ చేయనుంది. ఇక ఈ రెండు జట్లు చివరి మ్యాచ్ లో సాధించిన ఉత్సహంతో ఈ మ్యాచ్ లో ఎదురుపడనున్నాయి. అయితే ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ ఫామ్ లోకి రావడం అలాగే కేకేఆర్ జట్టులో ముఖ్య బౌలర్ సునీల్ నరైన్ ఈ మ్యాచ్ ఆడకపోవడం అనేది ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. కానీ రస్సెల్ ఈ జట్టుపైన ఎలా చెలరేగుతాడో అందరికి తెలుసు. మరి చూడాలి ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధిస్తుంది అనేది.

బెంగళూరు : దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కత : రాహుల్ త్రిపాఠి, శుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ (w/c), టామ్ బాంటన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Related posts