telugu navyamedia
క్రీడలు వార్తలు

అందుకే ఓడిపోయాం అంటున్న రోహిత్…

Rohit

పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసిన విషయం తెలిసిందే. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన రాహుల్ సేన అనంతరం బ్యాటింగ్‌లోనూ ప్రణాళికలకు తగ్గట్లు రాణించి అలవోక విజయాన్నందుకుంది. ఇక మ్యాచ్ ఓటమిపై స్పందించిన రోహిత్.. ‘కావాల్సిన పరుగులు చేయకపోవడమే మా ఓటమికి కారణం. ఈ పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఏం లేదు. పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల విజయాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఎప్పుడైనా 150-160 పరుగులు చేస్తే మ్యాచ్‌లో నిలవొచ్చు. గత రెండు మ్యాచ్‌లుగా ఈ విషయంలో మేం విఫలమయ్యాం. కావాల్సిన పరుగులు చేయలేకపోయాం. దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పవర్‌ ప్లే‌లో వారి బౌలింగ్ ఎక్స్‌లెంట్. ఇషాన్ కిషన్ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. నేను కూడా పవర్ ప్లేలో పరుగులు చేయలేకపోయా. మేం ప్రయత్నించినా వికెట్ చాలా నెమ్మదిగా ఉండటంతో సాధ్యం కాలేదు. గత నాలుగు మ్యాచ్‌ల్లో మేం పవర్ ప్లే‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాం. కానీ ఈ రోజు విఫలమయ్యాం. 20 ఓవర్ల పాటు మా బ్యాటింగ్ బాగా సాగలేదు. ఈ వైఫల్యాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు.

Related posts