రోడ్డు ప్రమాదంలో మరణించిన పారిశుద్ధ్య కార్మికురాలు జె.దుర్గమ్మ కుటుంబ సభ్యులకు శుక్రవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రూ.2 లక్షల పరిహారాన్ని అందజేశారు.
హయత్ నగర్ సర్కిల్ ఆటో నగర్ హై వే పై స్వీపింగ్ చేస్తుండగా జనవరి 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై సనత్ నగర్ ఈ.ఎస్.ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 14న మరణించిన శానిటేషన్ కార్మికురాలు దుర్గమ్మ బాధిత కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల చెక్కు ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం తన ఛాంబర్ లో పంపిణీ చేశారు.