స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడింది. కేరళలో జరగాల్సిన తొలి షెడ్యూల్ను కరోనా కారణంగా ఆంధ్ర ప్రాంతంలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించాలని అనుకుంటున్నారు. అయితే కరోనా వల్ల హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో ఫారెస్ట్ సెట్ వేసి షూటింగ్ చేస్తారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాస్త ఆలస్యమైనా మారేడు మిల్లి ప్రాంతంలోనే షూటింగ్ జరుగనుందని అంటున్నారు. అందుకోసం మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో రోడ్లను బాగు చేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి.
next post