మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొల్చారం మండలం చిన్నఘన్పూర్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన డీసీఎం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి నుంచి డీసీఎంలో ఏడుపాయలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
జగన్ సైకో ఇజంతో ఈ ప్రభుత్వం ముందుకు: నారా లోకేశ్