బెంగళూరులోని కోరమంగళ మార్స్ కల్యాణమండపం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ పోల్ను ఢీకొట్టింది.. దీంతో.. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా 20 నుంచి 30 ఏళ్ల మధ్యవారే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే వై ప్రకాశ్ కొడుకు, కోడలు ఉన్నారు. హోసూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వై. ప్రకాష్ కుమారుడు మృతిచెందాడని పోలీసులు తెలిపారు.
వీరంతా కలిసి బెంగళూరులో నైట్అవుట్కు వెళ్లిన్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తున్న యువతీ యువకులు కనీసం సీట్బెల్ట్ కూడా ధరించలేదని తేలింది. సోషల్ మీడియాలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.