telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

అతివేగంతో .. విహార యాత్రకు వెళ్లినవాళ్లు .. పరలోకాలకు …

Road accident 8 dead and 30 injured

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రకు చెందిన రైల్వే పోలీస్ అధికారి మెల్విన్ దేశ్‌ముఖ్ కుటుంబం తమిళనాడులో విహారయాత్రకు వచ్చింది. యాత్ర ముగించుకుని సోమవారం సాయంత్రం వీరు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఓ కంటెయినర్‌ను ఢీకొట్టింది.

ఈ రోడ్డు ప్రమాదంలో కారులోని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts