telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విద్యాబాలన్ ముద్దులతో మెసేజ్ చేసింది… హీరో షాకింగ్ కామెంట్స్

Vidya-Balan

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ముద్దులతో మెసేజ్ చేసిందంటూ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ విషయాన్ని రితేష్.. ‘హౌస్‌ఫుల్ 4’ ప్రమోషన్స్‌లో భాగంగా వెల్లడించారు. ‘విద్యా నాకు ముద్దులు పెడుతూ మెసేజ్ చేసేసరికి షాకయ్యా. అసలు నేను మెసేజ్ చేయకుండా ఆమె ఇలా ఎందుకు చేశారు అని కంగారుపడ్డా. ఆ తర్వాత తెలిసింది ఇది అక్షయ్ చేసిన పని అని. ఇలా ఎందుకు చేశావ్‌ అని నేను అక్షయ్‌ని నిలదీస్తే.. ప్రాంక్స్ చేయడంలో ఓ మజా ఉంటుంది అన్నాడు’ అని వెల్లడించాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సెట్‌లో అక్షయ్ ప్రాంక్స్ చేస్తుంటాడు. ఆయనకు ఇది ఎప్పటినుంచో ఉన్న పిచ్చి అలవాటు. ఆయన చేసే ప్రాంక్స్ వల్ల ఇతర నటీనటులు ఇబ్బందుల్లో పడుతుంటారు. అలా విద్యా బాలన్‌తోనూ అక్షయ్ ప్రాంక్ చేశాడు.

అసలేం జరిగిందంటే… 2007లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హే బేబీ’. ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్.. రితేష్ ఫోన్ నుంచి విద్యా బాలన్‌కు మెసేజ్ పంపాడు. ‘ఐ లవ్యూ’ అంటూ ముద్దులు పెడుతున్న మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత విద్యా బాలన్ ఫోన్ తీసుకుని.. ‘ఐ లవ్యూ టూ’ అని మెసేజ్ పెట్టాడు. షూటింగ్ మధ్యలో రితేష్ తన ఫోన్ తీసి చూసుకుని షాకయ్యాడు. ఆ తర్వాత తెలిసిందేంటంటే.. ఈ ఘనకార్యం అక్షయ్ కుమార్ చేసిందని. ఇది అక్షయ్‌కి సరదాగానే అనిపించినా.. విషయం సీరియస్ అయితే గనక నలుగురి జీవితాలు అల్లకల్లోలం అయ్యేవి. ఎందుకంటే అప్పటికే రితేష్‌, జెనీలియా ప్రేమలో ఉన్నారు. విద్యా బాలన్, ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నారు. అయితే అక్షయ్ ముందే తాను ప్రాంక్ చేశానని చెప్పాడు కాబట్టి సరిపోయింది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ కథానాయకులుగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్దే హీరోయిన్స్‌గా నటించారు. ఫర్హాద్ సంఝీ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts