telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మందు బాబులకు మద్దతుగా బాలీవుడ్ నటుడు రిషి కపూర్

rishikapoor

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఇక మందు బాబుల పరిస్థితి మాత్రం వర్ణనాతీతం.. ముందుగా తెలిస్తే స్టాక్ పెట్టుకునే వాళ్లం కదా అని ఆవేదన చెందుతున్నారు. కొందరు గజతాగుబోతులైతే బ్రాండ్ ఏదైనా పర్లేదు గుక్కెడు బ్రాందీ దొరికితే చాలు అనుకుంటున్నారు. తాజాగా మందు బాబులకు మద్దతుగా బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ చేసిన ట్వీట్ సోషల్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏమని ట్వీటారంటే.. ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి డ‌బ్బు అవ‌స‌రం. అందుకోసం కొంత కాలం లైసెన్స్ పొందిన మ‌ద్యం దుకాణాల‌ని సాయంత్రం స‌మ‌యంలో తెర‌వాలి. ఈ విష‌యంలో న‌న్ను తప్పుగా అర్థం చేసుకొని తిట్టొద్దు. మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో పోలీసులు, వైద్యులు, పౌరులకి మద్యం అవసరం. బ్లాక్‌లో అయినా మద్యం అమ్మే ఏర్పాట్లు చేయండి’ అని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇక నెటిజన్లు తమ రిప్లైలతో రెచ్చిపోయారు. నిత్యావసర వస్తవులు దొరక్క ఇబ్బంది పడుతుంటే మందు కావాలా ఫుల్లుగా మందేసి ఆడాళ్ల మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి.. ఈ విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్రాముఖ్యత తెలియజేయాల్సింది పోయి మందు గోలేంటండీ బాబు.. అంటూ రిషిని ఓ ఆటాడుకుంటున్నారు. 

Related posts