జూన్ నెలలో న్యూజిలాండ్తో ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడేందుకు టీం ఇండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. టీమిండియా వికెట్ కీపన్ రిషబ్ పంత్ కూడా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. దేశమంతా లాక్డౌన్ ఉండడంతో ఎక్కడికి వెళ్లలేక ఇంట్లోనే ఉంటూ తన ఫిట్నెస్ను మెరుగుపరుగుచుకునే క్రమంలో ఉన్నాడు. ఈ సందర్భంగా పంత్ తన ఇంట్లోని గార్డెనింగ్ ఏరియాలో మోవర్ యంత్రంతో అటు ఇటు తిరుగుతూ గడ్డిని శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్లో షేర్ చేశాడు.
“యే దిల్ మాంగే ”మోవర్” అంటూ క్యాప్షన్ ఇచ్చి.. అనుకోకుండా వచ్చిన క్వారంటైన్ బ్రేక్తో ఏం చేయలో అర్థం కాలేదు. కానీ మా ఇంటి ఆవరణలో గార్డెనింగ్ చేయడం కాస్త రిలీఫ్గా అనిపించింది. ఇది నాకు మంచి వ్యాయామమే గాక ఫిట్నెస్ను పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.” అంటూ పేర్కొన్నాడు. పంత్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. కాగా రిషబ్ పంత్ ఐపీఎల్ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Ye Dil Mange "Mower"!
Forced quarantine break but happy to be able to stay active while indoors. Please stay safe everyone.#RP17 pic.twitter.com/6DXmI2N1GY— Rishabh Pant (@RishabhPant17) May 11, 2021