తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వస్తుండడంతో అనేక కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికీ పేదలు ఉపాధి దొరక్క అలమటిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. జూలై నుంచి నవంబరు వరకు పేదలకు 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 2.79 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
యురేనియం తవ్వకాలపై చంద్రబాబు ఫైర్