telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా ఎఫెక్ట్ .. పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం!

rice supply

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వస్తుండడంతో అనేక కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికీ పేదలు ఉపాధి దొరక్క అలమటిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. జూలై నుంచి నవంబరు వరకు పేదలకు 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 2.79 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

Related posts