ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజులకి గాను 25 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టిందని టీం చెబుతుంది. పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన శిష్యుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్ కావడంతో సంచలన దర్శకుు రామ్ గోపాల్ వర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ సిటీ పోలీసులకు ‘ఇస్మార్ట్ శంకర్’ సాక్షిగా సవాల్ విసిరాడు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ..తన శిష్యులైన మరో ఇద్దరు డైరెక్టర్లు..ఆర్.ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వర్మతో డైరెక్ట్ చేసిన అగస్త్య మంజుతో కలిసి బుల్లెట్ బండిపై హెల్మెట్ లేకుండా త్రిపుల్ రైడ్తో హైదరాబాద్,మూసాపేటలోని శ్రీరాములు థియేటర్కి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను వెళ్లాడు. ఈ సందర్భంగా తాను త్రిపుల్ రైడింగ్తో సినిమా థియేటర్కు వచ్చిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఇపుడీ ఫోటో సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. అంతేగాక ‘‘పోలీసులు ఎక్కడున్నారు.. థియేటర్లలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూస్తున్నారనుకుంటా’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై వెంటనే స్పందించిన పోలీసులు.. ఆ వెహికిల్కు జరిమానా విధించారు. వెహికిల్ నంబర్ను టీఎస్ 07 జీపీ 2552గా గుర్తించిన పోలీసులు.. బండి యజమాని బద్దె దిలీప్ కుమార్కు 1300 రూపాయలు చలానా రాశారు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం కింద ఈ జరిమానాలు విధించారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల “ఇస్మార్ట్” తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సునీత ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు