హైదరాబాద్ మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను రాళ్లతో కొట్టాలని రేవంత్రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వీడిన 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కేసీఆర్కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ చర్యలు తీసుకోవాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే ఆయనపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని ఆమె నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా రేవంత్రెడ్డి కలిశారు.
previous post
నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర -మంత్రి మల్లారెడ్డి