గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి అన్నీ తానై ప్రచారంలో దూసుకుపోతున్నాడు. పార్టీ ఎక్కడ బలంగా ఎక్కడ ఉందో అక్కడే.. ఫోకస్ పెడుతున్నాడు. ఎన్నికల జరుగుతున్న వేళ.. తాజాగా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాగాయకుడు గద్దర్ ను కలిశారు. గద్దర్ తో అనేక విషయాలు గురించి చర్చించారు. మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసినపుడు మొదట గద్దర్ ని కలిశానని గుర్తు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో గెలవకున్నా కనీసం 25 నుంచి 30 స్థానాల్లో అయినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ప్రజలు తప్పకుండా తమకు అండగా ఉంటారని అన్నారు. ప్రతిపక్షం బలంగా ఉంటే సమస్యలపై పోరాడి పరిష్కారం చేసుకోవచ్చని అన్నారు. గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీకి 30 మంది కార్పొరేటర్లను ఇస్తే సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
previous post
next post