telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఆ ఇద్ద‌రు మోస‌గాళ్లే- రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్ : కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్ద‌రు దొందుదొందేన‌ని, ఇద్ద‌రు క‌లిసి రైతుల‌ను మోసం చేస్తున్నార‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పంజాబ్ స‌హా 24 రాష్ర్టాల‌లో పెట్రోల్‌, డిజిల్‌పైన వ్యాట్ త‌గ్గించిన‌ప్పుడు తెలంగాణ‌లో ఎందుకు త‌గ్గించ‌ర‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డంలో అవినీతి సొమ్ము దాచుకోవ‌డంలో కేసీఆర్‌, మోడీ ఇద్ద‌రు ఒక్క‌టేన‌ని మండిప‌డ్డారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో కేసీఆర్ ప్రెస్‌మీట్ మ‌య స‌భ‌లో దుర్యోధ‌నుడి ఏక‌పాత్రాభిన‌యంలా ఉంద‌ని ఎద్దేవా చేశారు. వ‌రి వేయ‌మ‌ని కేంద్రానికి చెప్పి, వ‌రి వేస్తే ఉరి అని కేసీఆర్ తెలంగాణ రైతుల‌కు మ‌ర‌ణ శాస‌నం రాశాడ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్‌ను త్వ‌ర‌లోనే బంగాళాఖాతంలో క‌లుపుతార‌న్నారు.

Related posts