telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాకు కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది: రేవంత్‌రెడ్డి పిటిషన్

Revanth-Reddy mp

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాకు ప్రభుత్వ పెద్దల నుంచే ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

కేంద్ర ప్రభుత్వం లేదంటే, స్వతంత్ర ఏజెన్సీల నుంచి 4 ప్లస్ 4 గన్‌మెన్‌తో ఎస్కార్ట్ కల్పించాలని ఆదేశించాల్సిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థించారుగతంలో తనకు 3 ప్లస్ 3 గన్‌మెన్‌తో రక్షణ ఉండేదని, ఆ తర్వాత దాన్ని 2 ప్లస్ 2కు తగ్గించినట్టు కోర్టుకు తెలిపారు. తన ప్రాణాలకు హాని ఉండడంతో భద్రత పెంచాలని కోరుతూ 28 ఆగస్టు 2019న కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.

Related posts