telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓటుకు నోటు కేసులో..ఏసీబీ కోర్టుకు రేవంత్ ‌రెడ్డి

Revanth-Reddy mp

2015 లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అప్పట్లో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఆయన జైలులోనూ ఉన్నారు. ఈ కేసులో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ వైపునకు ఆకర్షించేందుకు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తూ రేవంత్‌ రెడ్డి పట్టుబడ్డ విషయం తెలిసిందే.

Related posts