ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి శనివారం కంటోన్మెంట్ ప్రాంతంలో పర్యటించారు. తాడ్బండ్లోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యూబోయిన్పల్లికి వెళ్లే క్రమంలో తాడ్బండ్ చౌరస్తాలో సిగ్నల్ పడటంతో రేవంత్ కాన్వాయ్ ఆగింది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆయన కారు నెంబర్పై ఉన్న చలానాల జాబితాను పరిశీలించారు.
సైదాబాద్, రాజేంద్రనగర్లో అతివేగం, నో పార్కింగ్ చేసినందుకు రేవంత్ కారుపై రూ.5 వేల చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆయన కారు వద్దకు వెళ్లి చలానాల గురించి రేవంత్కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే పెండింగ్ ఉన్న మొత్తాన్ని ట్రాఫిక్ పోలీసులకు చెల్లించారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా