telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ సెక్రటేరియట్ పిటిషన్ పై విచారణ వాయిదా

Congress Revanth Comments TRS

సచివాలయం కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన పత్రాలను తమకు సమర్పించాల్సిందిగా కోర్ట్ స్పష్టం చేసింది.

ఇదీ వ్యవహారం పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి 2016లో దాఖలుచేసిన పిటిషన్ పై ఇప్పుడు విచారణ జరపలేమని, దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని హైకోర్టు పేర్కొంది. జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఆగస్టు చివరివారంలో విచారించగలమని తెలిపింది.

Related posts