telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కాల్పులు జరిపిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి అరెస్టు

gun fire

గాల్లోకి కాల్పులు జరిపిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి తిరుమల రెడ్డిని పెద్ద పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ధర్మారం మండలం సాయంపేటకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ రెడ్డి ఈ రోజు ఉదయం మీడియాకు వివరించి చెప్పారు.

తిరుమలరెడ్డి గాల్లోకి కాల్పులు జరుపుతుండగా తీసిన ఓ వీడియోను కొందరు రెండు రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తిరుమల రెడ్డి గాల్లోకి 14 రౌండ్ల కాల్పులు జరిపాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు అతడిని అరెస్టు చేసి, తుపాకీ, ఆరు తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

Related posts