telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఒడిశాలో .. 12 చోట్ల మళ్ళీ పోలింగ్.. సిఫార్స్ ..

repoling in 12 places in odisa

కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)కి ఒడిశా రాష్ట్ర సీఈవో సురేంద్రకుమార్‌, ఒడిశాలో బ్రహ్మగిరి నియోజకవర్గంలోని 62వ పోలింగ్‌ బూత్‌తో పాటు రాష్ట్రంలో 12 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని సిఫార్సు చేశారు. బ్రహ్మగిరి నియోజకవర్గంలోని 62వ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం కంట్రోల్‌ యూనిట్ తారుమారైంది. స్ట్రాంగ్‌రూం నుంచి సిబ్బంది ఈవీఎంలను తీసుకున్నప్పుడే ఈ పొరపాటు జరిగింది. అందువల్ల అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలి.

రాష్ట్రంలో 12 చోట్ల మూడో దశ పోలింగ్‌ సందర్భంగా ఇబ్బందులు తలెత్తాయి. అక్కడ కూడా రీపోలింగ్‌ నిర్వహించాలి, అంటూ సీఈసీకి రాసిన లేఖలో ఒడిశా సీఈఓ పేర్కొన్నారు. ఏప్రిల్ 23న ఒడిశాలో శాసనసభ, పార్లమెంటుకు జరిగిన మూడో దశ ఎన్నికల్లో 71.61 శాతం పోలింగ్‌ నమోదైంది. ఏప్రిల్‌ 29న నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Related posts