పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే పరశురామ్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతుండటం తో తిరిగి సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ప్రస్తుతం ‘సర్కారు వారిపాట’ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో మహేష్ సిస్టర్ పాత్ర ఉందని.. ఆ పాత్రలో రేణూ దేశాయ్ నటించబోతుందని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే.. తాజాగా దీనిపై మరో అప్డేట్ వచ్చింది. రేణూ దేశాయ్… మహేష్కి వదినగా నటించబోతుందని… ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ రేణూ దేశాయ్ని సంప్రదించారని సమాచారం. అయితే… ఈ ఆఫర్కు రేణూ దేశాయ్ కూడా ఓకే చెప్పిందట. అంతేకాదు… ఈ పాత్ర విషయంలో ఆమె చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
previous post
next post