telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒక చేప ఆత్మ నాలో ఉంది… మాల్దీవుల్లో రేణూ దేశాయ్

renudesai with dengue photo viral

ప్రముఖ నటి, దర్శకురాలు, రచయిత్రి అయిన రేణు దేశాయ్… పవన్ నుంచి విడిపోయిన తరువాత పుణే వెళ్లిపోయి మరాఠి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. రేణు దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చాలా మందికి తెలిసిందే. రేణు ఒక మంచి కవియిత్రి కూడా. ప్రస్తుతం ఆమె ఒంటరిగా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా అందమైన మాల్దీవుల్లో. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, రెండు అందమైన ఫొటోలను కూడా షేర్ చేశారు. సముద్రంలో ఒంటరిగా జలకాలాట ఆడటం ఎంతో బాగుందని పేర్కొన్నారు. “పర్వతాలు నా హృదయమైతే, మహాసముద్రం నా ఆత్మ అని ఇప్పుడు నాకు తెలిసింది. ఈ మాల్దీవులు విహారయాత్రలో సముద్రంలో నేను ఒంటరిగా గంటలపాటు ఈతకొట్టిన తరవాత ఈ విషయం నాకు అర్థమైంది. ఒక చేప ఆత్మ నాలో ఉందని తెలుసుకున్నాను. అగ్ని నాకు ఇష్టమైన భూతం అంటే వెటకారంగా అనిపించేది. అగ్ని అనే కాన్సెప్ట్‌కు నేను బాగా ఆకర్షితురాలి అయ్యాను. కానీ, నీటిలో ఉంటే ఇంట్లో ఉన్న భావన కలుగుతోంది. జీవితం అంటే ఇదే అని ఇప్పుడు నాకు తెలిసింది. వ్యంగ్యాలు, వైరుధ్యాలు” అని వేదాంతం చెప్పుకొచ్చారు రేణు. ప్రస్తుతం రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆధ్య.. తమ తండ్రి పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నట్టు సమాచారం.

Related posts